అఖిల్.. మరో కాంబో సెట్టయ్యిందా?

అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరో అక్కినేని అఖిల్. అతని కెరియర్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే అవేవీ కూడా కమర్షియల్ గా అతనికి స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని తీసుకురాలేదని చెప్పాలి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ అనే సినిమా చేస్తూ ఉన్నారు.

ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 28 న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఆశించిన స్థాయిలో అప్డేట్స్ ప్రేక్షకులకు రీచ్ కాలేదు. సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్న ప్రేక్షకుల్లో మాత్రం రిజిస్టర్ కాలేదని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అఖిల్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ ఏ దర్శకుడుతో చేస్తాడు అనే దానిపై ప్రస్తుతం ఒక టాక్ బయటకు వచ్చింది. దసరా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఒదేల డైరెక్షన్ లో అఖిల్ సినిమా ఉంటుంది అనే మాట వినిపిస్తూ ఉంది.

రీసెంట్ గా శ్రీకాంత్ అఖిల్ ని కలిసి కథ కూడా చెప్పడం జరిగింది అనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమా దసరా తరహాలో కాకుండా డిఫరెంట్ కథాంశంతో ఉండబోతుంది అనే మాట వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం అఖిల్ దృష్టి అంత ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ పైన ఉంది.

ఈ సినిమా రిలీజ్ తర్వాత శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా అనౌన్స్ జరిగే ఛాన్స్ ఉన్నట్లుగా ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తూ ఉన్న మాట. దసరాతో సూపర్ సక్సెస్ అందుకోవడంతో శ్రీకాంత్ ఒదేల రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ తో బడా ప్రొడక్షన్స్ సినిమాలు చేయడానికి కమిట్మెంట్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం నడుస్తుంది.