మరోసారి ప్రేక్షకులముందుకు రానున్న సీతారామం జోడి…?

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం సీతారామం. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూళ్లను కొల్లగొట్టింది. సీతారామం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సీతా మహాలక్ష్మి పాత్రలో నటించిన ఈ అమ్మడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. ఇక ఈ సినిమాలో రష్మిక, సుశాంత్, తరుణ్ భాస్కర్ వంటి వారు కూడా నటించారు.

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మృణాల్ ఠాకూర్ కి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్నాదత్ బ్యానర్ లో రాబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో మృణాల్ అవకాశం దక్కించుకుందని సమాచారం. ఈ సినిమాకి టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదలైన ఓ బేబీ వంటి సినిమాతో హిట్ అందుకున్న నందిని రెడ్డి తర్వాత చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా కనిపించనున్నట్లు సమచారం.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఆగస్టు 5వ తేదీన తెలుగులో విడుదలైన సీతారామం సినిమా సెప్టెంబర్ 2న హిందీలో విడుదల కానుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా హిందీలో ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూడాలి మరి. ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ అవకాశం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న ఎన్టీఆర్ 30 సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్ ఎవరూ అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతో మంది పేర్లు వినిపించాయి . సీతారామం సినిమాతో హిట్ అందుకున్న ఈ అమ్మడు ఎన్టీఆర్ 30 సినిమాలు నటించే అవకాశం అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.