సీతారామం సినిమా కోసం ఆ హీరోలను కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేశారు. ఇలా ఈ సినిమా హిందీలో కూడా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేస్తుంది.అందమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమా కోసం హనురాగవపూడి ముందుగా ముగ్గురు హీరోలను కలిసారని అయితే ఆ ముగ్గురు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఈ సినిమాలో నటించే అవకాశం దుల్కర్ సల్మాన్ కు వచ్చిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ హను రాఘవపూడి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను సీతారామం సినిమా కోసం ఈ ముగ్గురు హీరోలను కలవలేదని క్లారిటీ ఇచ్చారు.

తాను నాచురల్ స్టార్ నానిని కలిసిన విషయం నిజమే అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన సన్నివేశాలతో మరొక సినిమా చేయడం కోసం ఆయనతో సంప్రదింపులు జరిపానని తెలిపారు.ఇక విజయ్ దేవరకొండతో తాను వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సమయంలో కలిశానని ఆ సమయంలో కూడా సీతారామం సినిమా కోసం తనని కలవలేదని తెలిపారు. ఇక హీరో రామ్ తో తాను కలిసినప్పటికీ మరొక సినిమా చర్చల విషయం కోసం కలిశానని ఈ సందర్భంగా హను రాఘవపూడి తెలియచేయడమే కాకుండా తాను ఏ హీరోలను దృష్టిలో పెట్టుకొని సినిమా కథ రాయనని సినిమా కథ పూర్తి అయిన తరువాతే హీరోలను ఎంచుకుంటానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.