అత్యంత ఖరీదైన రీ-రిలీజ్ ‘సింహాద్రి’.!

దండగమారి వ్యవహారం.! ఏంటిలా అనేశాం అనుకుంటున్నారా.? అవునండీ.! ‘సింహాద్రి’ రీ రిలీజ్ విషయంలో జరుగుతున్న హంగామాకి చాలా మంది అభిప్రాయం ఇలాగే వుంది మరి.

దాదాపు వెయ్యి షోలు వేస్తున్నారట. తెలుగు సినీ పరిశ్రమలో ఇదో కొత్త రికార్డు మరి.! చందాలేసుకుని మరి, అభిమానులే టిక్కెట్లు కొంటున్నారట.

ఇదేం పద్ధతి.? అంటూ గుస్సా అవుతున్నారు అభిమానుల్లోనే కొందరు. హీరోలు ఈ తరహా రీ-రిలీజులని ప్రోత్సహించకూడదు.. అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఎన్టీయార్ బర్త్‌డే సందర్భంగా ఈ నెల 20న ‘సింహాద్రి’ సినిమా రీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

అభిమానుల సంక్షేమం కోసమే ఈ రీ రిలీజుల ట్రెండ్ అని చెబుతున్నారుగానీ.. తెర వెనక జరుగుతోన్న ముచ్చట వేరేలా వుంది. ఈ రీ రిలీజుల హంగామా కారణంగా అభిమానులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

హీరోల పట్ల వున్న అభిమానంతో తప్పక హంగామా చేయాల్సి వస్తోంది. దాంతో ఖర్చులు తడిసి మోపెడైపోతున్నాయట. హీరోలూ.! జర శోచాయించాలి గీ ముచ్చట.