క్రేజీ : వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ పై “సింహాద్రి” రీ రిలీజ్.!

రీసెంట్ గానే టాలీవుడ్ సినిమా దగ్గర స్టార్ట్ అయ్యిన కొత్త రీ రిలీజ్ ట్రెండ్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలలో లేటెస్ట్ గా కేజ్రీగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా భూమిక హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మాస్ హిట్ సినిమా “సింహాద్రి” కూడా ఒకటి.

మరి గతంలో వచ్చిన “ఆంధ్రావాలా” రీ రిలీజ్ ని ఫాన్స్ అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ సింహాద్రి రీ రిలీజ్ కోసం అయితే ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఇంకా మే 20న రిలీజ్ కాబోతుండగా ఫ్యాన్స్ ఇపుడు నుంచే నెవర్ బిఫోర్ ప్లానింగ్ లు వేస్తున్నారు.

మరి ఈ ప్లానింగ్స్ లో భాగంగా మొట్ట మొదటి సారిగా ఏ సినిమా రీ రిలీజ్ కి చేయని ప్లాన్ చేశారు. అదే ఈ ప్రపంచం లోనే బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ అయినటువంటి మెల్ బోర్న్ ఐమ్యాక్స్ లో ప్లాన్ చేసుకున్నారు. ఇది ఆస్ట్రేలియాలో ఉంది.

మరి ఓ టాలీవుడ్ స్టార్ కి వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్క్రీన్ కి స్పెషల్ షో పడడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. మరి ఆ రోజు హంగామా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ మాస్ చిత్రానికి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.