షాకింగ్ : ట్రీట్మెంట్ కి 25 కోట్లు..సమంత ఏం చెప్తుందంటే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి రీసెంట్ గానే సమంత తన భారీ సిరీస్ “సిటాడెల్” అలాగే యంగ్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో చేసిన లవ్ స్టోరీ చిత్రం “ఖుషి” లను కంప్లీట్ చేసింది.

అయితే తాను హీరో నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి ఆమెకి ఎదురైన విమర్శలు సవాళ్లు అన్ని ఇన్ని కాదు. పైగా ఆమె ఆరోగ్యం కూడా దెబ్బ తింది. అలా దెబ్బ తిన్నాక ఆమె ఎక్కడైనా నవ్వుతూ కనిపించడమే మరో పాపం అన్నట్టుగా ట్రోల్స్ కూడా పడ్డాయి.

అయితే సమంత ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ లు నుంచి గ్యాప్ ఇచ్చి తన మాయోసైటిస్ చికిత్స కోసం గ్యాప్ తీసుకుంది. సుమారు ఏడాది బ్రేక్ తీసుకున్న సమంతపై పలు షాకింగ్ రూమర్స్ ఇప్పుడు బయటకి వచ్చాయి. వీటితో ఆమె తన మాయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేస్తుంది అనే వార్తలపై సమంత స్పందించింది.

దీనికి సర్కాస్టిక్ గా పోస్ట్ చేస్తూ “మాయోసైటిస్ ట్రీట్మెంట్ కి 25 కోట్లా? ఎవరో మీకు చాలా బ్యాడ్ డీల్ తీసుకొచ్చారు. కానీ నేను అందులో చాలా చాలా తక్కువ మొత్తంలో అమౌంట్ తోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను థాంక్స్ దేవుడా. అలాగే నేను నా ఇన్నాళ్ల కెరీర్ లో ఎంతో కొంత సంపాదించాను లక్కీగా అందులోనే సరిపోతుంది. ఈరోజుల్లో మాయోసైటిస్ చాలా మందికి వస్తుంది. అందరూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.” అంటూ ఈ షాకింగ్ రూమర్స్ పై తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. దీనితో ఈమె పోస్ట్ వైరల్ గా మారింది.