షాకింగ్ : జపాన్ భూకంపాల్లో ఎన్టీఆర్? తన లేటెస్ట్ పోస్ట్ వైరల్ 

తెలుగు సినిమా ప్రైడ్ నటుల్లో ఒకడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇపుడు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తన గత చిత్రం “ఆర్ ఆర్ ఆర్” తో భారీ సక్సెస్ ని తాను అందుకోగా ఈ సినిమా తర్వాత తారక్ చేస్తున్న తదుపరి చిత్రమే “దేవర”.

కాగా దర్శకుడు కొరటాల శివతో తాను చేస్తున్న రెండో సినిమా ఇదే కావడంతో భారీ హైప్ నెలకొంది. అలాగే నిన్ననే ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పోస్టర్ తో గ్లింప్స్ రిలీజ్ పై కూడ బిగ్ అప్డేట్ అందించారు. కానీ ఈ గ్యాప్ లోనే ఒక షాకింగ్ న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కంగారు పెట్టింది.

మరి ఎన్టీఆర్ కొత్త సంవత్సరం క్రిస్మస్ వేడుకలకి గాని కుటుంబంతో జపాన్ కి పయనం అయ్యాడు. అప్పుడు ఫోటోలు వీడియోస్ కూడా కొన్ని వైరల్ గా మారాయి. కానీ ఇక్కడకి వెళ్ళాక షాకింగ్ భూకంపాలు మొదలయ్యాయి. దీనితో జపాన్ ఇప్పుడు అస్తవ్యస్తంగా మారగా ఎన్టీఆర్ అక్కడ ఇరుక్కున్నాడని అంతా అనుకున్నారు.

అయితే నిన్న అర్ధ రాత్రి సమయంలో తారక్ తన కోసం అప్డేట్ అందించాడు. తాను ఇండియాకి తిరిగి వచ్చేసాను అని ఎవరు కంగారు పడవద్దని తెలిపాడు. కానీ జపాన్ ని భూకంపాలు కుదిపేయడం నన్ను చాలా షాక్ కి గురి చేసింది. గత వారం అక్కడే ఉన్నాను అక్కడి ప్రజలు చూపించిన అభిమానం నా హృదయాన్ని కదిలించింది. కానీ ఇంతలోనే ఇలా జరగడం బాధ కలిగించింది. అని అయితే జపాన్ అతి త్వరగానే రికవర్ అవుతుంది అని కోరుకుంటున్నాను అని తాను తెలిపాడు.