సోషల్ మీడియాలో ఆగిపోయిన సమంత సందడి.. కారణం ఏంటి..?

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వారి మధ్య మనస్పర్ధల కారణంగా కొంతకాలానికే అతనికి దూరమైంది. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత చాలా కాలం డిప్రెషన్ లో ఉంది. ఆ సమయంలో స్నేహితులతో కలిసి వెకేషన్ కు , డివోషనల్ టూర్స్ కి వెళ్లి కొంతకాలం రిలాక్స్ అయ్యింది.

ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత గత కొంతకాలంగా చాలా సైలెంట్ అయిపోయింది. ఇంస్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ సమంత పోస్ట్ పెట్టి రెండు వారాలు గడుస్తోంది. అయితే ఇలా సడన్ గా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉండటానికి కారణం ఏమై ఉంటుందని అందరూ అనుమాన పడుతున్నారు.జూన్‌ 30న ఇన్‌స్టా లో చివరిగా పోస్ట్ షేర్ చేసిన సమంత అప్పటినుండి ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదు. దీంతో సమంతకి ఏమైంది? సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉందా? లేక సమంత కావాలనే సోషల్ మీడియా కి దూరంగా ఉంటుందా? అని అనుమాన పడుతున్నారు.

సమంత తన వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉంటుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌తో సోషల్‌ మీడియాలోకి రీఎంట్రీ ఇస్తుందని ఇంకొందరు భావిస్తున్నారు. అయితే సమంత ఇలా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉండటానికి కారణం ఏంటో తెలియడం లేదు. ఈ విషయం గురించి సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో కూడా సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు తొందర్లోనే విడుదల కానున్నాయి. అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో కలిసి సమంత ఖుషి సినిమాలో నటిస్తోంది.