Samantha: విడాకుల తర్వాత చైతన్య ఫొటోను షేర్ చేసిన సమంత… ఎందుకో తెలుసా ?

Samantha: టాలీవుడ్‌లో మొన్నటివరకూ మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత – నాగచైతన్యలు విడిపోయారంటే అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ విడిపోయి సుమారు 6నెలలు కావస్తున్నా, ఏదో ఒక రూపంవో వారిద్దరి విడాకుల అంశం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ జంట విడాకుల విషయం ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే హల్‌చల్‌ చేస్తుంది. అసలు చై-సామ్‌ విడాకులకు సంబంధించి కారణాలు ఏంటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ఇక విడాకుల అనంతరం వీళ్లిద్దరూ ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. అంతేకాదు నాగ చైతన్యకు సంబంధించిన ఫొటోస్‌ను కూడా సామ్ తన సోషల్‌ మీడియాలో అకౌంట్ నుంచి డిలీట్‌ చేసేసింది. ఆ తర్వాత చైని ఇన్‌స్టాలో అన్‌ఫాలో కూడా చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచింది.. అప్పటినుంచీ సామ్ తన పిక్స్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడమే కాకుండా, కొన్ని ఎమోషనల్ కోట్స్ కూడా జత చేస్తూ ట్రెండింగ్‌గా నిలుస్తోంది. చైతో డైవోర్స్ తర్వాత పలు ప్రాజెక్ట్స్‌కు కూడా ఓకే చెప్పిన సమంత, ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసి, పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళితే తాజాగా సామ్‌ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే విడాకుల అనంతరం తొలిసారిగా నాగచైతన్య ఫోటోని పోస్ట్ చేస్తూ, అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది సమంత. అయితే ఇది పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించింది న విషయం కాకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఈ ఫొటోపై కన్నేస్తున్నారు. వారిద్దరూ చివరగా జంటగా నటించిన బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి మజిలీ 3ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 3ఇయర్స్‌ ఆఫ్‌ మజిలీ అంటూ ఓ పోస్టర్‌ని తాజాగా సమంత షోర్ చేయడంతో ఈ జంట మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఫొటోను షేర్‌ చేసిన కాసేపటికే వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.