సమంత రేంజ్ వేరు.. ఇకపై టాలీవుడ్ లో లేనట్టే.. అంత అక్కడే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న వారిలో అక్కినేని నాగచైతన్య సమంత జంట ఒకటిగా ఉండేది. అయితే నాలుగు సంవత్సరాల వీరి అందమైన వైవాహిక జీవితంలో పలు మనస్పర్థలు చోటు చేసుకోవడం వల్ల వీరు వారి వైవాహిక బంధానికి శుభం కార్డు పలికారు. ఇలా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఎవరికి వారు జీవిస్తూ తమ కెరీర్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సమంత విడాకుల ప్రకటన తర్వాత పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లి తన బాధను మరచి పోతుంది.అదేవిధంగా పూర్తిగా తన కెరియర్ పై దృష్టి పెట్టిన సమంత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తెలుగులో శాకుంతలం సినిమా పూర్తి చేసిన ఈమె త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.విడాకుల ప్రకటన తర్వాత సమంతా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారికంగా వెల్లడించారు. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్తుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాప్సి ప్రొడక్షన్ లో సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అయితే తాజాగా సమంత తన దూకుడును మరింత పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ చిత్రాలకి కాకుండా ఏకంగా హాలీవుడ్ చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో సమంత ఓ బేబీ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన సునీత తాటి నిర్మాణంలో ఫిలిప్ జాన్ దర్శకత్వంలో రచయిత తిమెరి ఎన్ మురారి నవల అయిన ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్న ట్లు తెలుస్తోంది. ఈ సినిమా హాలీవుడ్ తరహాలో తెరకెక్కడం తో కొంత భాగం ఇండియాలోనూ మరికొంత భాగం వేల్స్ లో షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సునీత తాటి శాకినీ ఢాకినీ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అనంతరం సమంత సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.ఇలా సమంత ఏకంగా హాలీవుడ్ చిత్రాలను చేయడంతో ఇకపై తెలుగులో నటిస్తారా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మొత్తానికి సమంత విడాకుల తర్వాత పూర్తిగా తన కెరియర్ పై దృష్టి సారించి ఎన్నో చిత్రాలతో బిజీగా ఉన్నారు.