Samantha: ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్కు కోటి రూపాయలు రెమ్యూనిరేషన్ అంటే చాలా ఎక్కువ. కానీ ఇప్పుడున్న క్రేజ్కు, తీస్తున్న సినిమాలను బట్టి చూస్తే సినిమా బడ్జెట్తో పాటు వారి రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు నయనతార నాలుగు నుంచి అయిదు కోట్లు డిమాండ్ చేస్తుంది అంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు పూఙా హెగ్డే మూడున్నర కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటోందని టాక్. రష్మిక కూడా ఏ మాత్రమూ తగ్గకుండా తన రెమ్యూనిరేషన్ను మూడు కోట్లకు చేర్చబోతోందని సమాచారం.
ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత కూడా అదే బాటలో నడుస్తున్నట్టు సమాచారం. ఆమె ఇటీవల తీసిన ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ భారీ హిట్ కావడంతో, ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. రాజీ పాత్రలో డీ గ్లామర్ లుక్లో, ఒళ్లుగగుర్పొడిచే యాక్షన్తో ఆడియెన్స్ని మంత్రముగ్దుల్ని చేసిన సమంత ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలోనూ ఏ మాత్రం వెనకడుగు వేసేటట్టు లేదని సమాచారం.
ఇప్పుడు హీరోయిన్ పాత్రల నుంచి బయటికొచ్చిన సమంత తాజా పుష్ప సినిమాలో ఊ అంటావా ఊఊ అంటావా ఎవరూ ఊహించని స్థాయిలో విజయవంతం కావడంలో ఆమె మార్కెట్ భారీగా పెరిగిపోయిందనే చెప్పవచ్చు. ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత, ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించబోతున్నట్టు టాక్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా… సమంత ఈ చిత్రంలో నటించేందుకు గానూ 3 కోట్లు అడిగనట్టు.. దానికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాలో ఒక్క పాటకే 1.5 కోట్లు తీసుకుందని అప్పట్లో ప్రచారం జరగగా, ఆ తర్వాత ఆ సాంగ్కు వచ్చిన పేరును చూసి అందరికీ అది సబబుగానే తోచింది. ఇక ఆ పాట హిట్ కావడమే ఇప్పుడు ఆమె పారితోషికాన్ని పెంచడానికి కారణమని చూస్తేనే అర్థమవుతోంది. దీంతో సమంత మళ్లీ ఫాంలోకి వచ్చిందంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.