Samantha: ఎంత గొడవ పడ్డా వెంటనే మళ్లీ.. .. సమంత లేటేస్ట్ పోస్ట్ వైరల్..!

Samantha: ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై, మొదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన అందాల బామ సమంత. నిత్యం మూవీస్, షూటింగ్స్‌తో బిజీగా ఉండే సమంత, నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఏదో ఒక అంశంపై వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంత, ఈ మధ్య కాలంలో ఎమోషనల్‌ కోట్స్‌తో కూడిన పోస్ట్‌లు చేస్తుండడం అందరికీ తెలిసిన విషయమే. ఇక వర్కవుట్‌ల గురించి చెప్పాలంటే, ఎప్పటికప్పుడు స్టిఫ్‌గా ఉండేందుకు చేసే కసరత్తులు చేస్తూ తన అందాన్నే కాదు, ఆరోగ్యం విషయంలోనూ తగిన జాగ్రత్తలు వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు సమంత.

ఇకపోతే సమంతకు మామూలుగా పెట్స్ అంటే ఇష్టమని, వాటితో దిగిన ఫొటోలను ఇన్స్‌స్ట్రాంలో ఎప్పటికప్పుడు పంచుకునే ఆమె, తాజాగ చేసిన ఓ పోస్ట్‌ అందరినీ ఆకర్షిస్తోంది. తన దగ్గరున్న హాష్, సాషా అనే పెంపుడు జంతువుల పిక్‌లను పోస్ట్‌ చేస్తూ జీవితంలో సిబ్లింగ్స్‌ మధ్య సమస్యలు వస్తూ ఉంటాయని, అది తనకు తెలుసు అంటూ ట్యాగ్‌లైన్‌ ఇచ్చింది. ఇలా తన అల్లరి కుక్క పిల్లలతో ఎంజాయ్‌ చేస్తూ జీవితంలో ముందుకు దూసుకుపోతోంది హీరోయిన్ సమంత.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత, ప్రస్తుతం ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగ, ఇందులో ఆమె నర్స్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని ఇప్పటికే వార్తలు రాగా, బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేయబోతుందని సినీ వర్గాల ప్రచారం.