Samantha: థాయిలాండ్ నుంచి ఇండియాకు ల్యాండ్ అయిన సమంత… సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీ!

Samantha:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతుండగా మరికొన్ని సినిమాలు షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాయి.ఇలా వరుస సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమంత హాలిడే వెకేషన్ కోసం థాయిలాండ్ వెళ్లారు.థాయిలాండ్ లో స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేసిన ఈమె తిరిగి ఇండియా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్టులో సమంత సందడి చేశారు.థాయిలాండ్ వెకేషన్ నుంచి ఇండియా చేరుకున్న సమంత తదుపరి తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాత్తూ వాక్కుల రెండు కాదల్. ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో కూడా కేఆర్ కే పేరుతో విడుదల చేయనున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఇన్ని రోజులు సమంత దూరంగా ఉన్నారు.

థాయిలాండ్ వెకేషన్ లో సమంత ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం ఈమె థాయిలాండ్ నుంచి ఇండియా చేరుకోవడంతో సరాసరి ఇతర సినిమా పనులలో కాకుండా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ కానున్నారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం పాల్గొన్నారు.ఇక ఈ సినిమా విడుదలైన తరువాత సమంత తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.