చైతన్యతో పాటు కలిసి ఉన్న ఇంటిని అధిక ధరకు కొనుక్కున్న సమంత.. కారణం?

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయికలలో సమంత కూడా ఒకరు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఆ సినిమా హిట్ అవ్వటంతో తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సమంత తన అందంతోపాటు అభినయంతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈమెకు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించే అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. సమంత నటించిన సినిమాలు అన్ని దాదాపుగా మంచి హిట్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్యతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.

చాలాకాలం ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందిన వీరు దాదాపు పెళ్లయిన మూడు సంవత్సరాలకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. అయితే ఈ స్టార్ కపుల్ విడిపోవడం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని ఎంతోమంది ఆశిస్తున్నారు. కానీ అది జరిగే విషయం కాదని అందరికీ అర్థమయింది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత తన వైవాహిక జీవితం విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకుల కోసం నాగచైతన్య నుండి 250 కోట్లు మరణంగా తీసుకుందని వస్తున్న వార్తలను కూడా తీవ్రంగా ఖండించింది.

ఇదిలా ఉండగా సమంత నాగచైతన్య పెళ్లయిన తర్వాత అలానాటి నటుడు మురళీమోహన్ ఇంటిని కొలుగొన్న చేసి ఆ ఇంట్లో జీవించేవారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్ సమంత నాగచైతన్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ ఎప్పుడు అరుచుకున్నట్లు కనీసం ఒక్కరోజు కూడా వారి గొంతు వినిపించలేదు. ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. వారిద్దరూ విడిపోతారని నేను అస్సలు ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇండిజువల్ హౌస్ కొనుగోలు చేశారని, ఆ సమయంలో నా వద్ద కొనుక్కున్న ఇంటిని వేరే వారికి అమ్మారని మురళీమోహన్ వెల్లడించారు.

అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత సమంత ఇంటి కోసం చాలా చోట్ల తిరిగి మా ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా సెక్యూర్డ్ గా ఉంటుందని భావించి నన్ను అడిగింది. మేము మీకు అమ్మిన ఇల్లు మీరే వేరే వారికి అమ్ముకున్నారు. ఇప్పుడేం చేయగలం అని అన్నాను. తర్వాత ఆ ఇల్లు కొనుక్కున్న వారితో మాట్లాడి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి సమంత మళ్ళీ ఆ ఇంటిని కొనుక్కుందని మురళీమోహన్ వెల్లడించారు.