సల్మాన్‌ టైగర్‌ సీక్వెల్‌ టైగర్‌ 3

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించిన ఏక్‌ థా టైగర్‌ , టైగర్‌ జిందా హై సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంఛైజీలో వస్తున్న తాజా చిత్రం టైగర్‌ 3. మనీశ్‌ దర్శకత్వం వహిస్తుండగా యాష్‌ రాజ్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు.

మొదటి రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్‌ బ్యూటీ కత్రినాకైఫ్‌ ఈ చిత్రంలో కూడా హీరోయిన్‌గా చేస్తుంది. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ కామియోలో మెస్మరైజ్‌ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమా నుంచి మేకర్స్‌ తాజాగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

ఈ సినిమాని దీపావళి కానుకగా హిందీ, తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించారు. అయితే విడుదల తేదీని మాత్రం మేకర్స్‌ ప్రకటించలేదు. కాగా దేశభక్తి ప్రధాన ఇతివృత్తంతో రాబోతున్న ఈ చిత్రంకు సంబంధించి చివరి షెడ్యూల్‌ మినహా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు.