కార్తీక్ నేరేషన్ తోనే నన్ను భయపెట్టాడు – తేజ్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. సుకుమార్ రైటింగ్స్, ఎస్విసీసీ బ్యానర్ లో బోగవల్లి ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో డిఫరెంట్ థ్రిల్లర్ జోనర్ లో వస్తోన్న మొదటి సినిమా విరూపాక్ష కావడం విశేషం. ఇంతకు ముందు కమర్షియల్, లవ్ అండ్ ఎంటర్టైన్ మెంట్ చిత్రాలు ఎక్కువ చేసిన సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకొని విరూపాక్ష మూవీని ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏలూరులో జరిగింది.

ఈ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర ప్రసంగం చేశారు. ముఖ్యంగా తన లైఫ్ గురించి ఫ్యాన్స్ తో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అలాగే రోడ్డు ప్రమాదం తర్వాత మళ్ళీ తాను ఎలా రికవరీ అయ్యాను, తనకి మెగాస్టార్, పవర్ స్టార్, నాగబాబు సపోర్ట్ ఏ స్థాయిలో ఉందో అనే విషయాలు పంచుకున్నారు. ఇక ఈ సందర్భంగా విరూపాక్ష మూవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తనకి హర్రర్ సినిమాలు అంటే టెర్రర్ అని తేజ్ అన్నారు. అయితే సుకుమార్ ఫోన్ చేసి మంచి కథ ఉందని చెప్పగానే ఏదో డిఫరెంట్ లవ్ స్టొరీ అయ్యి ఉండొచ్చు అనుకున్న. కాని కార్తిక్ దండు వచ్చి ఈ స్టొరీ నేరేట్ చేసిన తర్వాత నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఈ స్టొరీ నేను హ్యాండిల్ చేయగలనా అనిపించింది. అయితే ప్రేక్షకులకి కొత్తగా ఏదైనా తన నుంచి ఇవ్వాలని భావించి మూవీ చేసాను.

కార్తిక్ దండు తాను ఏదైతే తనకి నేరేట్ చేసాడో అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. నిజంగా ఈ మూవీతో నన్ను భయపెట్టేసాడు. మూవీ మీ అందరికి కూడా చాలా థ్రిల్ చేస్తుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని ఇప్పటికే డిసైడ్ అయిపోయా. కచ్చితంగా మీ అందరికి మూవీ నచ్చుతుంది అని తేజ్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.