Sai Dharam tej : కేజీఎఫ్ భారతీయ సినిమాను ఊర్రుతలూగించారాంటూ ట్వీట్…..!

Sai Dharam tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోలుకుని మళ్ళీ సినిమా షూటింగ్స్ తో బిజీ అవుతున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు సాయి. ఇక గురువారం విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి ఆసక్తికర ట్వీట్ చేసి వైరల్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 విడుదల అయి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకుని చరిత్ర సృష్టిస్తోంది. కేజీఎఫ్ 1 కంటే అధిక వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ జోరు చూస్తుంటే ఈ సినిమా బాహుబలి రికార్డులను బద్దలుకొడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా.. రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్‌తో హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ నిర్మించగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో యష్ స్టైలిష్ పెర్ఫార్మన్స్ మరియు హీరో ఎలివేషన్ ను దర్శకుడు చూపిన విధానం బాగుందనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా గురించి అందరు మాట్లాడుతున్నారు. కామన్ జనాలనుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సినిమాపై స్పందిస్తున్నారు. ఇక అలానే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించారు.కేజీఎఫ్ మూవీతో భారతీయ సినిమాను ఉర్రూతలుగించారు. అంతేకాదు, దేశ వ్యాప్తంగా వినిపించారు అలాగే, ఇప్పుడు కేజీఎఫ్ 2తో మరోసారి భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకోవాలి’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు సాయి తేజ్. ఇక మూవీ టీమ్ మొత్తాన్ని సాయి తేజ్ విష్ చేశారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.