అప్పుడే సీక్వెల్ పుకార్లా.?

‘స్కంధ’ సినిమాకి సీక్వెల్ రాబోతోందట. ఇదీ తాజా గాసిప్. బోయపాటి శీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘స్కంధ’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా వుంది.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి ఓ తాజా గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఒక్క పార్టే కాదట. ఇంకో పార్ట్ కూడా వుండబోతోందట. సినిమాలో సెకండ్ పార్ట్‌కి సంబంధించి చిన్న లీక్ వదిలిపెట్టారట.. అంటూ ప్రచారం జరుగుతోంది.

బోయపాటి ముందు సినిమా ‘అఖండ’ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ, ఇంతవరకూ అలాంటి అప్టేడ్ ఏమీ లేదు ‘అఖండ’పై. ప్రస్తుతం ‘స్కంధ’ విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే, నిజంగానే ‘స్కంధ’ సినిమాకి సీక్వెల్ వుండబోతోందనీ చిత్ర యూనిట్ నుంచి లీకులొస్తున్నాయ్ చూడాలి మరి.

అన్నట్లు రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.