వైరల్ గా మారిన “RRR” ఆస్కార్ ఈవెంట్ టికెట్స్ ఖర్చు.!

గత కొన్ని రోజులు కితం మన తెలుగు సినిమా మరియు ఇండియన్ సినిమా దగ్గర చరిత్ర సృష్టించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. కాగా ఈ భారీ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు ని తెలుగు నేలకి తీసుకొచ్చింది. దీనితో తెలుగు వారికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఈ సినిమా అప్పుడు ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు చేసారని అనేక విమర్శలు ప్రతి విమర్శలు చాలానే వచ్చాయి.

కానీ మేకర్స్ మాత్రం ఆస్కార్ అవార్డు సొంతం చేసుకొని అందరి నోర్లు మూయించారు. కాగా ఈ సినిమా నుంచి ఆస్కార్ ఈవెంట్ కి సంబంధించి మరో అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమా యూనిట్ అక్కడికి వెళ్లగా ఈవెంట్ లో పాల్గొనేందుకు గాను టికెట్స్ కొనుకొనే వెళ్లారట.

అక్కడ ఈవెంట్ లో ఒక్క ఎం ఎం కీరవాణి మరియు చంద్రబోస్ లకి మాత్రమే అకాడమీ ఈవెంట్ వారు ఫ్రీ టికెట్స్ ఇవ్వగా  ఇక నెక్స్ట్ రాజమౌళి సహా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తాలూకా టికెట్స్ కూడా కొనుక్కొనే వెళ్లారట. మరి ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఒకో టికెట్ కి ఏకంగా 20 లక్షలు పెట్టారట.

దీనితో ఈ టికెట్స్ అన్నీ కూడా రాజమౌళి పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ ఖర్చు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో ఆసక్తికర టాక్ గా నిలిచింది. ఇక నెక్స్ట్ అయితే ఈ సినిమా నటులు టెక్నీషియన్స్ ఎవరి సినిమాల్లో వారు బిజీ అవుతున్నారు.