RRR Heroes: మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ మూవీ తాజాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లల్లో కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు రోజు రోజుకీ ఆదరణ మరింత పెరుగుతూ వస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం మాములు ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీస్ వరకూ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. టికెట్స్ కోసం చాలా మంది ఓ యుద్ధమే చేశారు. ఏ సినిమాకూ లేని విధంగా ఈ సినిమా చాలా రికార్డ్స్ సొంతం చేసుకొని, ఇప్పటికే భారీ విజయాన్ని అందుకుంది.
అయితే మనకు ఏదైనా అత్యంత ఎక్కువగా నచ్చితే దాని మీద ప్రేమను ఒక్కోక్కరు ఒక్కోలా వ్యక్తం చేస్తారు. అలాగే ఒక సినిమా నచ్చింది అంటే ఒక్కో ప్రేక్షకుడు, ఒక్కో అభిమాని ఒక్కోలా తెలియజేస్తారు. కొందరు ఆ హీరో ఫోటోకు పాలాభిషేకం చేస్తే, మరికొందరు తమ అభిమాన హీరో సినిమా టికెట్స్ ను కొని ఫ్రీగా తనకు తెలిసిన వారికి ఇస్తారు. మరి కొందరేమో డాన్స్ లు చేస్తూ, టపాసులు కాలుస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమకు నచ్చిన విధంగా తెలియజేస్తారు. అలాగే ఓ మండల ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సూక్ష్మ చిత్రకారుడు అయినటువంటి సోమా పద్మ రత్నం ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక రావి ఆకుపై ఆ సినిమాలోని హీరోస్ చిత్రాలను వేసి, తన అభిమానాన్ని వినూత్నంగా తెలియజేసి పలువురి మెప్పు పొందుతున్నారు. ఈ కళాఖండాన్ని అభిమానులకు అంకితం చేశానన్న ఆయన, కళా నైపుణ్యం కోసమే ఈ చిత్రాలు వేశానని ఆయన స్పష్టం చేశారు.
