రాకింగ్ స్టార్ యష్ ఆ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పాడా?

కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ స్టార్ గా మారిపోయిన రాకింగ్ స్టార్ యష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఏడాది గ్యాప్ ఇచ్చిన యష్ మలయాళీ ఫిమేల్ డైరెక్టర్ తో ఒక సినిమాకి ఒకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే ఇంకా రాలేదు.

ఇక బాలీవుడ్ లో రామాయణం కథని మూడు భాగాలుగా తెరకెక్కించడానికి రంగం సిద్ధం అవుతోంది. రామాయణం ఆధారంగా వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని రామాయణం కథని చెప్పాలని దర్శకుడు నితీష్ తివారి భావిస్తున్నారంట. చాలా కాలం నుంచి ఈ కథపై వర్క్ చేస్తున్నారు.

ఇక మూవీలో శ్రీరాముడి పాత్రకి రణబీర్ కపూర్, సీతాదేవిగా అలియా భట్ ని ఫిక్స్ చేసారంట. లంకేష్ రావణ్ పాత్ర కోసం రాకింగ్ స్టార్ యష్ ని సంప్రదించినట్లు గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ పాత్ర చేయడానికి యష్ అంగీకరించినట్లు ఇప్పుడు బిటౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబందించిన టెస్ట్ షూట్ రీసెంట్ గా మొదలు పెట్టారంట.

రాకింగ్ స్టార్ యష్ ఈ టెస్ట్ షూట్ లో పాల్గొన్నట్లు బాలీవుడ్ లో వినిపిస్తోన్న మాట. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందంట. ఒక వేళ యష్ ఈ మూవీలో నటిస్తే మాత్రం కచ్చితంగా సౌత్ లో రామాయణం సిరీస్ కి మంచి హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. అల్లు అరవింద్, మధు మంతెన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

చాలా కాలంగా రామాయణం ప్రాజెక్ట్ గురించి బాలీవుడ్ లో ప్రచారం నడుస్తూనే ఉంది. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు. ఈ లోపే ఓం రౌత్ ఆదిపురుష్ మూవీ తీసి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ తివారి చేయబోయే రామాయణంపై కూడా హిందుత్వ సంఘాలు ఒక కన్ను వేసి ఉంచాయి.