జనవరి 2 న ప్రభాస్ చేతులమీదుగా ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ !

Impressive reports for Prashanth Varma's Zombie Reddy

ప్రశాంత్ వర్మ.. మొదటి సినిమా ‘అ!’ తోనే జాతీయ అవార్డు పొందిన యువ దర్శకుడు. అ సినిమా తర్వాత ఆయన రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ తన మూడో సినిమా జాంబీ రెడ్డి రూపోందించే బిజీగా ఉన్నాడు. నిజ జీవిత ఘటనలను ఆధారం చేసుకొని ఈ సినిమా తీస్తున్నాడట. తెలుగులో వస్తోన్న మొట్టమొదటి జాంబీ ఫిల్మ్ జాంబీ రెడ్డి అని చెబుతున్నాడు దర్శకుడు.

 

టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్యాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా జనవరి 2 న ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ విడుదల కాబోతున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా తాజాగా ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్ విడుదల చేయించి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. తాజాగా ఏకంగా ప్రభాస్ నే రంగంలో దించబోతున్నారు. మొత్తంగా జాంబీ రెడ్డి ప్రమోషన్స్ లో ఏ మాత్రం తగ్గడంలేదు. తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక, ఈ సినిమాలో రఘుబాబు, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, హర్ష వర్థన్, హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.