రవితేజని లైన్ లో పెట్టిన స్టార్ రైటర్

సినిమా చూపిస్త మామా మూవీతో రైటర్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సక్సెస్ అందుకున్న వ్యక్తి ప్రసన్న కుమార్. తరువాత నేను లోకల్ సినిమాతో మరో హిట్ ని ఈ రైటర్ ఖాతాలో వేసుకున్నాడు. చివరిగా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా బ్లాక్ బస్టర్ అందుకున్న ధమాకా సినిమాకి స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే ప్రసన్న కుమార్ అందించారు. ప్రస్తుతం రైటర్ కూడా దర్శకుడిగా మారడానికి సిద్ధం అవుతున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే కింగ్ నాగార్జునతో ఒక రీమేక్ సినిమాకి కథపై వర్క్ మొదలు పెట్టారు. అయితే ఆ సినిమా రీమేక్ రైట్స్ అభిషేక్ అగర్వాల్ దగ్గర ఉన్నాయి. అతను నాగార్జునతోనే తీయాలని అనుకుంటున్న వేరొక దర్శకుడిని రిఫర్ చేశారు. అయితే నాగార్జున మాత్రం ప్రసన్న కుమార్ ని ఒకే చెప్పారు. దీంతో క్లాష్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ముందుకి వెళ్ళడం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రసన్న కుమార్ నాగార్జున ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. అదే సమయంలో మరో కొత్త కథ సిద్ధం చేసుకొని రవితేజకి చెప్పి ఒకే చేయించుకున్నాడంట. నిర్మాతగా శ్రీనివాస్ చిట్టూరి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రసన్న కుమార్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బ్రో డాడీ రీమేక్ కి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రైటర్ ఫోకస్ అంత ప్రస్తుతం ఈ చిత్రంపైనే ఉందంట. దీని తర్వాత రవితేజ డేట్స్ చూసుకొని అతనితో సినిమాని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే రవితేజ చాలా మంది టాలెంటెడ్ దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కథ నచ్చితే కొత్త వాళ్ళతో చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలాంటిది ఆల్రెడీ తనకి ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రైటర్ తో మూవీ అనగానే ఒకే చెప్పేశాడు. మొత్తానికి రైటర్ గా సక్సెస్ అయిన ప్రసన్న కుమార్ ఇప్పుడు దర్శకుడిగా తన బ్రాండ్ చూపించుకోవడానికి రెడీ అవుతూ ఉండటం విశేషం.