పేరెంట్స్ కమెడియన్సా?.. రష్మిక మందాన్న పోస్ట్ వైరల్

రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలా ఆమె చేసే చేష్టలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. రష్మిక చేసే క్యూట్ క్యూట్ ఫోటోలకు అభిమానులు పడిపోతుంటారు. రష్మికలో అందమే కాదు.. కవిత్వాలు రాసే ప్రతిభ కూడా ఉంది. ఆ మధ్య తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే బంధం, ఉండాల్సిన అనుబంధం గురించి అద్భుతమైన పోస్ట్ చేసింది. అందులో తన తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పింది రష్మిక.

Rashmika Mandanna About Her Parents
Rashmika Mandanna About Her Parents

 

అలాంటి రష్మిక తాజాగా తల్లిదండ్రులపై వెరైటీ కామెంట్స్ చేసింది. రష్మిక ప్రస్తుతం హైద్రాబాద్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నీమధ్యే తిరుపతిలోనూ ప్రత్యక్షమైంది. ఆడాళ్లూ మీకు జోహార్లు మూవీ ప్రారంభోత్సవ వేడుకల్లో రష్మిక మెరిసింది. మరో వైపు కోలీవుడ్ ప్రాజెక్ట్‌ల్లోనూ రష్మిక బిజీగా ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ల మూలంగా రష్మిక తన తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. తాజాగా రష్మిక తన పేరెంట్స్‌తో వీడియో కాల్‌లో ముచ్చిటించినట్టు తెలుస్తోంది.

Rashmika Mandanna About Her Parents

వీడియో కాల్‌లో మాట్లాడిన రష్మిక పేరెంట్స్‌పై కొంటె కామెంట్స్ చేసింది. మన జీవితంలో మన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు మొహం మీద వచ్చే చిరునవ్వు ఆ ఎంటర్టైన్మెంటే ఉండాలి అదే ముఖ్యం. వారి మొహాల్లో ఎన్నో ప్రతిబింబిస్తాయి.. మన మీద చేయాల్సిన ఫిర్యాదులు.. జీవిత పాఠాలు.. ఇలా ఎన్నో తెలుస్తాయి.. వారు కమెడియన్స్.. అంటూ రష్మిక చిరు నవ్వులు చిందిస్తోంది. తల్లిందండ్రులతో రష్మిక మాట్లాడుతూ ఫుల్ ఖుషీ అయినట్టు కనిపిస్తోంది.