కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాశీఖన్నా ..కీర్తి సురేష్ నే మించిపోతోంది ..?

టాలీవుడ్ లో రాశీఖన్నా సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వరసగా సినిమాలు చేస్తోంది. అయితే మారుతి దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా నటించిన ప్రతీ రోజూపండగే సినిమా తర్వాత మళ్ళీ రాశీఖన్నా కి తెలుగులో సినిమా చేసే ఛాన్స్ దక్కలేదని అంటున్నారు. కొత్తగా గా వచ్చిన ప్రియాంక అరుల్ మోహన్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి వాళ్ళతో పాటు సాయి పల్లవి, ఇస్మార్ట్ శంకర్ తో ఫాం లోకి వచ్చిన నభా నటేష్ .. లకి తెలుగులో మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి.

Prathi Roju Pandage' review; A fun ride- The New Indian Express

దాంతో రాశీఖన్నా హవా కాస్త టాలీవుడ్ లో తగ్గింది. కానీ కోలీవుడ్ లో మాత్రం రాశీఖన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ లో జ‌యం ర‌వి, విశాల్, విజ‌య్ సేతుప‌తి లాంటి హీరోలతో మంచి సూపర్ హిట్స్ అందుకుంది రాశి ఖన్నా. అంతేకాదు ఈ రెండేళ్ళు తమిళంలో సినిమాల‌తో రాశి ఖ‌న్నాకి బాగానే స్టార్ డమ్ అండ్ క్రేజ్ వచ్చేసింది. అక్కడ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనుకుంటే మేకర్స్ ముందు రాశీఖన్నా పేరునే పరిశీలిస్తున్నారని అంటున్నారు.

కాగా ప్రస్తుతం తాజాగా విక్రమ్ – హరి కాంబోలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన లో రాశి ఖన్నాకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే గనక నిజమైతే రాశీఖన్నా కి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. తెలుగమ్మాయి రీతూవర్మ కూడా తెలుగులో కంటే ముందు తమిళ సినిమాలలోనే నటించి పాపులారిటీని సాధించి ఇప్పుడు తెలుగులో వరసగా ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే రాశీ కి ఎక్కువగా తెలుగు సినిమాలు చేయాలన్న కోరికే ఎక్కువగా ఉందని అంటున్నారు. కాగా రాశీ క్రేజ్ ఇప్పుడు కోలీవుడ్ లో కీర్తి సురేష్ రేంజ్ లో ఉందన్న మాట వినిపిస్తోంది.