Mahesh Babu : మహేష్ సినిమా కు దక్కిన అరుదైన గౌరవం… ఏ సినిమాకో తెలుసా…?

Mahesh Babu : మహేష్ బాబు, పూజ హెగ్డే నటించిన చిత్రం మహర్షి. నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఈ చిత్రం మరో అరుదైన గౌరవాన్ని పొందింది. దుబాయ్ ఎక్స్ పో లో ఈ చిత్రాన్ని స్ఫూర్తిదాయక చిత్రంగా ప్రదర్శించారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో మహేష్ బాబు రెండు షేడ్స్ లో తన పాత్రకు న్యాయం చేసారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించినా ఈ చిత్రం లో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. వారంతపు వ్యవసాయం గురించి ఈ చిత్రంలో చూపించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సినిమా కు దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇండియన్ పెవిలియన్ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ ఫోర్ట్ నైట్ విభాగం లో దుబాయ్ ఎక్స్ పో 2022 లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ సినిమా విడుదల తర్వాత మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇలాంటి సందేశాత్మక చిత్రం తీసినందుకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. అలాగే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని దుబాయ్ ఎక్సపో లో ప్రదర్శించారాని ఇండియన్ ఎక్స్ పో తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ విషయం వైరల్ అవడంతో మహేష్ అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. మహేష్ బాబు తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట కోసం సిద్ధమవుతున్నారు.