Ram Charan: మరోసారి ఆలియా భట్‌తో కలిసి రామ్‌ చరణ్.. ఈ వేసవిలో ప్రేక్షకులకు మళ్లీ కనువిందే!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా అయ్యారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్‌ను కూడా ప్రిపేర్ చేసుకున్నట్టు సమాచారం. RRR సినిమాతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. కాగా ఆ సినిమా రిలీజ్ కాకముందే అతని రేంజ్ మరో పదింతలు రెట్టింపైనట్టు తెలుస్తోంది. దీంతో ప్రముఖ సంస్థలు సైతం ఆయన్ని అంబాసిడర్‌గా ఉండమని సంప్రదిస్తున్నాయని సమాచారం.

ఇక వివరాల్లోకి వెళితే రామ్ చరణ్‌కు క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో న‌టించ‌డం కొత్తేమీ కాదు. అలాంటి తరహాలోనే ఇప్పటికే ఆలియా భట్‌ అంబాసిడర్‌గా ఉన్న అత్యుత్తమ బెవరేజెస్ సంస్థ పార్లే ఆగ్రో రూపొందిస్తున్న ఫ్రూటీ యాడ్‌లో రామ్ చరణ్ కూడా నటించబోతున్నారట. వీరిద్దరూ కలిసి ఫ్రూటీ జ్యూస్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారని స్వయంగా పార్లే ఆగ్రో తెలిపింది. చెర్రీ, ఆలియా కలిసి మళ్లీ జత కట్టనుండడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పీ ఫిజ్ కోసం ప్రియాంక చోప్రా, బి ఫిజ్ కోసం అర్జున్ కపూర్, మిల్క్ స్మూతీ కోసం వరుణ్ ధావన్ ఉండగా తాజాగా ఫ్రూటీకి రామ్‌ చరణ్ ప్రచార కర్తగా మారడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉండడంతో అటు నందమూరి అభిమానులు, మరో వైపు మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇప్పటికే ట్రైలర్, పాటలు రిలీజ్ కావడంతో మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నట్టు తెలుస్తోంది.