రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమాపై తాజాగా ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ‘గేమ్ ఛేంజర్’ కథని మొదట పవన్ కళ్యాణ్ కోసం రాశాడట దర్శకుడు శంకర్.
అయితే, ఆ కథకు పవన్ కళ్యాణ్ కాదు, రామ్ చరణ్ అయితే బాగుంటుందని దిల్ రాజు సలహా ఇచ్చాడట. అలా రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాడనీ దిల్ రాజు ఓ సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారట. ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడమేంటీ.? అని ఫ్యాన్స్ దిల్ రాజుపై గుస్సా అవుతున్నారట.
‘బాబాయ్ ప్రాజెక్టును తన్నుకుపోయిన అబ్బాయ్..’ అనే టాక్కి ఛాన్సిచ్చినట్లు అవుతుంది రాజుగారూ.. అంటూ రామ్ చరణ్, దిల్ రాజుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసి, ఫ్యాన్స్ మధ్య గొడవలకు కారణం కావద్దు.. అది అస్సలు మంచిది కాదు.. అని స్వీట్గానే దిల్ రాజుని రామ్ చరణ్ హెచ్చరించాడట. ఈ గాసిప్పై నిజమెంతో తెలియాల్సి వుంది.