తమ్ముడి కోసం బ్లాక్ బస్టర్ సినిమాని త్యాగం చేసిన రామ్ చరణ్..?

Ram-Charan-becomes-the-new-

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి మెగా కుటుంబానికి పెద్దది ఎక్కువగా వ్యవహరించడమే కాకుండా ఇండస్ట్రీ పెద్ద గా కూడా అందరినీ సమస్యలను తీరుస్తూ ఉంటాడు. మెగా కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వీరిలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇక మెగాస్టార్ తమ్ముడు నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటిస్తూ నటుడిగా గుర్తింపు పొందినప్పటికీ హీరోగా మాత్రం రాణించలేకపోయాడు.

అయితే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మాత్రం హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ముకుంద సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరుణ్ తేజ్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో అప్పటినుండి వరుణ్ తేజ్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో నటించి హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా కథ ని శేఖర్ కమ్ముల మొదట వరుణ్ తేజ్ కి కాకుండ రామ్ చరణ్ కి చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే శేఖర్ కమ్ముల కథ మొత్తం వివరించిన తర్వాత ఈ స్టోరీ తన కన్నా వరుణ్ కి బాగా సెట్ అవుతుందని చెప్పి వరుణ్ తేజ్ ని ఒప్పించాడని సమాచారం. రామ్ చరణ్ ఫిదా సినిమాని వరుణ్ తేజ్ కి ఇవ్వబట్టే ఆ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఆ సినిమా తర్వాత వరుణ్ తేజ్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరితో ఒకరు చాలా ఆప్యాయంగా ఉంటారు. ఏదైనా ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా తన తమ్ముడి పట్ల ఉన్న ప్రేమ, అభిమానం వల్ల రామ్ చరణ్ ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ని రిఫర్ చేసినట్లు తెలుస్తోంది.