Ram Charan: అరుదైన సత్కారం అందుకున్న మెగా పవర్ స్టార్…బాహుబలి ఖాజతో సత్కరించిన రాజమండ్రి వాసులు!

Ram Charan: మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత తనకంటూ సొంత గుర్తింపుతో నటన, గ్రేస్ ఉన్న డాన్సుతో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. రామ్ చరణ్ RRR సినిమా కోసం ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఇన్ని రోజులు. ఇక ఇపుడు శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా 3వ షెడ్యూల్ చిత్రీకరణ కోసం రాజమహేంద్రవరం వెళ్లారు చిత్ర యూనిట్. రాజమహేంద్రవరంకు వచ్చిన అతిధులను సత్కరించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఇపుడు రామ్ చరణ్ కు ఆ అరుదైన సత్కారం లభించింది. తాపేశ్వరం సురుచి వారు రామ్ చరణ్ ను ఘనంగా సత్కరించారు.సురుచి పీఆర్వో వర్మ రామ్ చరణ్ ను బాహుబలి కాజా తో సత్కరించారు. రాజమండ్రి వచ్చిన ప్రముఖులను సత్కరించి బాహుబలి కాజా ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది వారికి. షెల్టన్ హోటల్ లో జరిగిన ఫోటోషూట్ లో వర్మ ఈ బాహుబలి కాజాను అందచేశారు.

రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న 15వ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శిరీష్ ఈ సినిమా కు సహా నిర్మాత. ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ కు హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ రెండో సారి రామ్ చరణ్ తో జతకడుతోంది. అంజలి,సునీల్, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.