ఆ యంగ్ హీరోయిన్ కి ప్రేమ పాఠాలు నేర్పుతున్న చెర్రీ.. బయటపడిన అసలు విషయం..!

టాలీవుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ఆచార్య, RRR చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగానే రామ్ చరణ్ మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ఇకపోతే రామ్ చరణ్ తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15 వ చిత్రాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో రెండవ షెడ్యూల్లో నేటి నుంచి ప్రారంభం చేశారు. ఇందులో రామ్ చరణ్ సరసన నటి కియారా అద్వానీ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.రెండవ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ హీరోయిన్ తో ప్రేమలో పడిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరిపై కొన్ని లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ శంకర్ కాంబోలో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించనున్నారు. దాదాపు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ ను ఈ చిత్రానికి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా 50వ సినిమా కావడంతో డబ్బు విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని దిల్ రాజు భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సునీల్, జయరాం, శ్రీకాంత్ అంజలి వంటి వాళ్ళు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.