రామ్‌చరణ్ మేగ్జిమమ్ ట్రై చేస్తున్నాడుగానీ.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అస్సలేమాత్రం నెగెటివిటీని ఆపలేకపోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ హిట్ కొట్టాక కూడా, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ని ఎదుర్కొంటూనే వున్నాడు. ‘ఎన్టీయార్ నాకు బ్రదర్..’ అని చరణ్ చెబుతున్నా, ఆ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు చరణ్‌ మీద ట్రోలింగ్ ఆపట్లేదు.

వాస్తవానికి రామ్ చరణ్ అభిమానులూ తక్కువేం కాదు. యంగ్ టైగర్ ఎన్టీయార్‌నీ ట్రోల్ చేస్తూనే వున్నారు. అయితే, చరణ్ అభిమానుల కంటే ఇక్కడ ఎన్టీయార్ అభిమానులదే పై చేయి. దానికి రకరకాల సమీకరణాలు వున్నాయి. తాజాగా, అమెరికాలో వున్న చరణ్.. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతోంటే, అది ఎన్టీయార్ అభిమానులకు మింగుడు పడ్డంలేదు. తన వరకూ చరణ్, తనకూ ఎన్టీయార్‌కీ వున్న స్నేహాన్ని చాటుకుంటూనే వున్నాడు.

ఇంటర్నేషనల్ మీడియా అర్థం చేసుకుంటోందిగానీ, తెలుగు మీడియానే అర్థం చేసుకోవట్లేదు అదే అసలు సమస్య. మీడియాని మేనేజ్ చేయలేకపోతున్నాడు చరణ్ తెలుగునాట. ఎన్టీయార్‌కి ఆ అవసరం లేదు. ఓ వర్గం మీడియా ఎన్టీయార్‌కి ‘సామాజిక వర్గ కోణంలో’ సపోర్ట్ చేస్తూనే వుంది..