Ram Charan : జవాన్లకు స్పెషల్ ట్రీట్.. వారితో కలిసి భోజనం చేసిన చరణ్..!

Ram Charan : ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్ల రికార్డులు సృష్టించడమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క గొప్పదనాన్ని తెలియజేసింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ఇంకా ఎన్టీఆర్ రామ్ చరణ్ లా నటన గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ లు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపుతెచ్చుకున్నారు.

ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కైరా అద్వాని రామ్ చరణ్కు జోడీగా నటిస్తోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం, రాజమండ్రి లో కూడా ఒక షెడ్యూల్ను పూర్తి చేసుకున్నారు. ఇక తాజాగా పంజాబ్ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఇటీవల పంజాబ్ పోలీసులు కూడా షూటింగ్లో సందడి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

అయితే ఇప్పుడు తాజాగా పంజాబ్ లో బీఎస్ఎఫ్ జవాన్లు చరణ్ ను చూడటం కోసం అక్కడికి రావడం జరిగిందట. వారి కోసం చరణ్ స్పెషల్ ట్రీట్ కూడా ఇచ్చారు. షూటింగ్ విరామ సమయంలో చరణ్ వారితో కలిసి ముచ్చటించి, వారి కోసం హైదరాబాద్ చెఫ్ తో ప్రత్యేకమైన భోజనాలు చేయించి ట్రీట్ ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా రామ్ చరణ్ జవాన్లతో కలిసి భోజనం కూడా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.