రకుల్‌ బ్యాచ్‌లర్‌ పార్టీ !

తన అందం, అభినయంతో టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో అభిమానులను సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్‌లో అగ్రహీరోలతో నటించిన ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం తన దృష్టిని అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. అయితే ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు జాకీ భగ్నానీతో రకుల్‌ ఈ నెల 21న గోవాలో పెళ్లి చేసుకోబోతుంది.

ఈ క్రమంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన స్నేహితులకు బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చింది. థాయ్‌ లాండ్‌ వేడుకగా ఈ బ్యాచిలర్‌ పార్టీ జరుగగా.. ఈ పార్టీకి టాలీవుడ్‌ హీరోయిన్స్‌ ప్రగ్యా జైస్వాల్‌, సీరత్‌ కపూర్‌, మంచు లక్ష్మి తదితరులు హాజరయ్యారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఫిబ్రవరి 21న గోవాలోని ఓ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రకుల్‌ పెళ్లి గ్రాండ్‌గా జరుగనుంది. ఇదిలావుంటే.. రకుల్‌ ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 సినిమాలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తోంది. రకుల్‌ తెలుగులో చివరగా 2021లో వచ్చిన ‘కొండపొలం’లో నటించింది. ఆ తర్వాత హిందీపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టింది.