RRR: సెన్సార్ కి బలైన ముఖ్యమైన సన్నివేశాలు… బాధలో ఎన్టీఆర్ అభిమానులు…!

 

RRR: దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో తీసిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం చాలా చురుగ్గా చేస్తోంది. ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు ఇంటర్వ్యూ లకు బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా, సెన్సార్ లో భాగంగా సినిమాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక కీలక సన్నివేశం కట్ చేసినట్లు సమాచారం. ఆ సన్నివేశం ‘అది భారతదేశపు’ అంటూ మొదలై ‘కొమరంభీమ్’ అంటూ ముగుస్తుందట. కట్ చేసిన సన్నివేశం యొక్క నిడివి  ఒక నిమిషం 36 సెకండ్లు అని టాక్.  ఒక్క రోజుకి దాదాపు యాభై లక్షలు అన్న తరహాలో ఈ సన్నివేశానికి నిర్మాత ఖర్చు పెట్టినట్లు కానీ ఈ సినిమా నిడివి ఎక్కువ కావటంతో… ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ సీన్ జక్కన్న కట్ చేసినట్లు సమాచారం.సెన్సార్ సభ్యుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.నిజానికి సెన్సార్ సమయంలో కొన్ని అభ్యంతరాలు వస్తాయి. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోక తప్పదు. వాటిని తొలగించేందుకు అంగీకారం తెలిపితే అనుకున్న మేర సెన్సార్ సర్టిఫికేషన్ లభిస్తుంది.ఈ వార్త తాజాగా బయటకు రావటంతో ఎన్టీఆర్ అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా నిడివి సుమారు మూడు గంటల ఆరు నిమిషాల పాటు ఉంటుంది. అయితే గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ మూడు గంటలకు తక్కువ సమయం ఉంది. కానీ త్రిబుల్ ఆర్ మాత్రం ఏకంగా మూడు గంటలకు పైగానే ఉండడంతో మరోసారి సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మరోపక్క సినిమా మంచి పాజిటివ్ టాక్ వస్తే… కొద్దిరోజుల తర్వాత మళ్ళీ కట్ చేసిన సన్నివేశం… కలిపెద్దమని రాజమౌళి అనుకుంటున్నట్లు కూడా టాక్.కాని నిజంగా సెన్సార్ కారణంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని కట్ చేశారా లేదా అన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకూ పూర్తిగా స్పష్టత రావడం లేదు.