Rajamouli:మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..?

 

Rajamouli:దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో తీసిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం చాలా చురుగ్గా చేస్తోంది. ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు ఇంటర్వ్యూ లకు బిజీగా ఉన్నారు.ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుంది.మొదటి రోజే ఈ సినిమా ఈజీగా వందకోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.

చిక్బలాపూర్ లో ఏర్పాటుచేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కావడానికి చిత్రబృందం బెంగళూరు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు హాజరయ్యే ముందు చిత్రబృందం కన్నడ మీడియా తో సమావేశమయ్యారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన రాజమౌళి తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబు తో రాజమౌళి తదుపరి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా మల్టీస్టారర్ ప్రాజెక్టుగా రాబోతున్నట్లు అనేక రకాల వార్తలు వినిపించాయి.అయితే ఆ సినిమా మల్టీస్టారర్ ప్రాజెక్టు కాదు అని రాజమౌళి మొదటిసారి క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలపై పెద్దగా స్పందించలేదు.ప్రస్తుతం తన దృష్టి అంతా ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఉందని, ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత కొంత విరామం తీసుకొని తరువాత తదుపరి చిత్రాన్ని తీస్తాం అని ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.