దర్శకుడి తొందరపాటు.. చిక్కుల్లో పడిన నాని కొత్త సినిమా

నేచురల్ స్టార్ నాని సినిమా ఒక వివాదంలో ఇరుక్కుంది. దర్శకుడు తొందరపడి తీసుకున్న నిర్ణయానికి హీరో అలాగే నిర్మాతలు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండస్ట్రీ పెద్దలు కూడా రంగంలోకి దిగుతున్నట్లు టాక్ వస్తోంది. నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

టక్ జగదీష్ అనంతరం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే..సుందరానికి.. అనే సినిమా చేస్తున్నాడు. అయితే దర్శకుడిపై ఒక నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ ఆత్రేయ మొదటి సినిమా మెంటల్ మదిలో. ఆ సినిమాను నిర్మించింది రాజ్ కందుకూరి. అయితే ఆ సినిమా తరువాత కమిట్మెంట్ ప్రకారం దర్శకుడు ఆ నిర్మాతతోనే రెండవ సినిమా చేయాలి.

అయితే వివేక్ ఆ తరువాత మరో ప్రొడక్షన్ లో బ్రోచేవారేవరురా అనే సినిమా చేశాడు. అప్పుడు పెద్దగా పట్టించుకోని రాజ్ కందుకూరి ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. వివేక్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ లో అంటే సుందరినికి అనే సినిమా చేస్తున్నాడు. దీంతో సినిమా షూటింగ్ పట్టాలెక్కిన తరువాత రాజ్ కందుకూరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు పిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ వివాదాన్ని వీలైనంత వరకు సాల్వ్ చేయాలని అడుగులు వేస్తున్నట్లు సమాచారం.