పుష్ప 2: సుకుమార్ పైనే అనుమానాలు?

పుష్ప ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సెకండ్ పార్ట్ అంతకుమించి అనేలా ఉండాలి అని అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ ఇద్దరు కూడా చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫ్యాన్ ఇండియా మూవీ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అయితే ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే పుష్ప 2 కు సంబంధించిన షూటింగ్ అయితే 30% పూర్తయింది. ఇంకా 70 శాతం వరకు పూర్తి చేయాల్సి ఉంది. అయితే సినిమాను 2024 ఏప్రిల్ చివరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఈ మధ్య కొన్ని కథనాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. కానీ ఆలోపు ఈ సినిమాను పూర్తి చేస్తారా లేదా అనేది పెద్ద సందేహంగా మారింది.

ఎందుకంటే 30% షూటింగ్ పూర్తి చేయడానికి సుకుమార్ దాదాపు ఒక ఏడెనిమిది నెలలు టైం తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన సగానికి పైగా షూటింగ్ ను ఈ 8 నెలల్లో పూర్తి చేస్తాడా లేదా అనేది మరొక పెద్ద అనుమానంగా మారింది. మళ్లీ సినిమాకు ప్రమోషన్స్ చేయాలి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా ఉంటాయి.

అసలే ఈసారి ప్రమోషన్స్ విషయంలో అల్లు అర్జున్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నాడు. పార్ట్ వన్ ప్రమోషన్స్ లో అయితే అసలు సుకుమార్ ఎక్కడ కూడా పెద్దగా పాల్గొనలేదు. కాబట్టి ఈసారి అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది .ఒకవేళ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే వచ్చే ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు.