భారీ హిట్టు కొట్టిన పృథ్విరాజ్‌ సుకుమారన్‌ మూవీ

మాలీవుడ్‌ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం మలైకోటై వాలిబన్‌. లిజో జోష్‌ పెల్లిస్సెరీ డైరెక్ట్‌ చేసినీ ఈ మూవీ రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 25న గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటివరకు అత్యధిక ప్రీ సేల్స్‌ బిజినెస్‌ చేసిన సినిమాగా మలైకోటై వాలిబన్‌ రికార్డు నమోదు చేసింది.

తాజాగా ఈ రికార్డును మరో మలయాళ స్టార్‌ హీరో బీట్‌ చేశాడు. తాజాగా ఎవరూ నమోదు చేయలేని అరుదైన ఫీట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. పృథ్విరాజ్‌ సుకుమారన్‌. ఈ స్టార్‌ హీరో నటించిన సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కేరళలో అత్యధిక ప్రీ సేల్స్‌ నమోదు చేసింది. మోహన్‌ లాల్‌ తర్వాత కేరళలో టాప్‌ ప్రీ సేల్స్‌ బిజినెస్‌ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు పృథ్విరాజ్‌ సుకుమారన్‌. వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్‌ రాసిన నవల స్ఫూర్తితో తెరకెక్కింది.

ఈ మూవీ ట్రైలర్‌ సినిమాపై సూపర్‌ బజ్‌ క్రియేట్‌ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తన పాత్రకు ప్రాణం పోశాడని ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్‌ చెబుతున్నాయి. బ్లేస్సీ రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో జివ్మిూ జీన్‌, లూయిస్‌, అమలాపాల్‌, రిక్‌ అబీ, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. విజువల్‌ రొమాన్స్‌ ఇమేజ్‌ మేకర్స్‌, జెట్‌ విూడియా ప్రొడక్షన్‌, అట్ల గ్లోబల్‌ విూడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. మోహన్‌ లాల్‌ ప్రస్తుతం వృషభ, సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్స్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి.