Kumbh Mela: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా.. 129 ఏళ్ల స్వామిజీ ప్రత్యేక ఆకర్షణ

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. మూడు రోజుల వ్యవధిలోనే ఆరు కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానాలు చేసి తమ ఆధ్యాత్మికతను వ్యక్తం చేశారు. ఈ మహా కుంభమేళా భక్తుల జీవితాల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ మహామేళాలో 129 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఆయన, గత వందేళ్లుగా జరిగే ప్రతి కుంభమేళాకు హాజరై భక్తులలో స్పూర్తిని నింపారు. యోగ, ధ్యానంలో తన జీవితాన్ని నిమగ్నం చేసిన ఈ మహనీయుని నిరాడంబర జీవన విధానం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 16లో స్వామి శివానంద కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు వద్ద భక్తులు బారులు తీరుతూ ఆయనను దర్శించుకుంటున్నారు. క్రమశిక్షణ, యోగ సాధన ద్వారా 129 ఏళ్ల ప్రాయంలోనూ ఆయన ఆరోగ్యం, ఉల్లాసం అందరినీ ఆకర్షిస్తోంది. స్వామి శిష్యుల మాటల ప్రకారం, ఆయన ప్రతి కుంభమేళా సమయంలో భక్తులకు మార్గదర్శనంగా నిలుస్తూ యోగ, ధ్యానం ప్రాముఖ్యతను చెబుతారు.

2022లో స్వామి శివానంద బాబాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు‌తో సత్కరించింది. యోగ, ధ్యానం ద్వారా సమాజానికి అందించిన విశేష సేవలకుగాను ఈ అవార్డు ఆయనను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చింది. తన అనుసరించిన నిరాడంబర జీవన విధానం ప్రతి ఒక్కరికీ మార్గదర్శిగా నిలుస్తోంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ఆయన ప్రాతినిధ్యం, భక్తుల కంటే ఎక్కువ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రతి భక్తుడు ఆయనను చూడటం ద్వారా స్ఫూర్తి పొందుతుండటం ఈ మహా మేళాకు ప్రత్యేకతను తెచ్చింది.

Common Man Shocking Comments On Chandrababu Ruling || Ap Public Talk || PawanKalyan || YsJagan || TR