టాలీవుడ్‌లో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్.!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘సలార్ సీజ్ ఫైర్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయమే తీసుకుంది. రెండో పార్ట్ ఎప్పుడొస్తుందన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇంకోపక్క, జూనియర్ ఎన్టీయార్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది. అది కూడా రెండు లేదా అంతకన్నా ఎక్కువ భాగాలతోనే తెరకెక్కుతుందన్నది తాజా ఖబర్.

ఇదిలా వుంటే, ప్రశాంత్ నీల్ తెలుగులో ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు సమాయత్తమవుతున్నాడంటూ ఓ గాసిప్ షురూ అయ్యింది. ఇద్దరు ప్రముఖ టాలీవుడ్ హీరోలు ఆ సినిమాలో కనిపించబోతున్నారట. రెండు పవర్ ఫుల్ ఫోర్సెస్.. అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడట ప్రశాంత్ నీల్.

తొలుత కన్నడ, తమిళ హీరోల కాంబినేషన్‌లో అనుకున్నా, పూర్తిగా తెలుగు హీరోల మీదనే ఇప్పుడు ఫోకస్ పెట్టి, ఆ సబ్జెక్ట్‌లో మార్పులు చేర్పులు చేశాడని అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా తర్వాత వుంటుందా.? ముందే వుంటుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ తరహాలో, రామ్ చరణ్ – ఎన్టీయార్ ఎందుకు ఆ ప్రాజెక్ట్ చేయకూడదు.? అనే వాదన కూడా తెరపైకొచ్చింది. ఏమో, ఎన్టీయార్ స్వయంగా ఈ ప్రాజెక్టులోకి రామ్ చరణ్‌ని తీసుకొస్తాడేమో కూడా.! అసలు జూనియర్ ఎన్టీయార్‌తో ప్రశాంత్ నీల్ తలపెట్టిన ప్రాజెక్టే.. ఇలా టర్న్ అయ్యిందేమో.!