Prashanth neel : నేను ఆ హీరో అభిమానిని…. తనతో సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేజీఎఫ్ డైరెక్టర్…!

Prashanth Neel :నందమూరి వారసుడు ఎన్టీఆర్ తన ప్రతిభతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తనదయినా స్థానాన్ని సంపాదించుకున్నాడు.ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తో దేశ వ్యాప్తంగా సినిమా అభిమానులను తన నటన తో ఫిదా చేశారు. సినిమా చుసిన ప్రతి సెలబ్రిటి కూడా ఎన్టీఆర్ నటన గురించి పొగడ్తల వర్షం కురిపించారు. అంతగా ఈ సినిమాలో తన నటన విశ్వ రూపాన్ని చూపించారు. ఇటు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అభిమానులను సంపాదించాడు.

ఇక కేజీఎఫ్: చాప్టర్-1′ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ‘కేజీఎఫ్-2’ను తీస్తున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ 14 న చిత్ర విడుదల ఉండటం తో ప్రమోషన్ ల లో పాల్గొంటున్నారు కేజీఫ్ 2 చిత్ర బృందం.అందులో భాగంగా ప్రశాంత్ నీల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యంగ్ టైగర్ తారక్ గురించి ప్రశాంత్ నీల్ కొన్ని కామెంట్స్ చేశారు.

తాను తారక్‌కు దాదాపుగా 20 ఏళ్ల నుండి వీరాభిమానినని చెప్పుకొచ్చిన ప్రశాంత్ నీల్, ఇప్పటివరకు ఆయన్ను 10, 15 సార్లు కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఇక తారక్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఆయన ఓ ఆటం బాంబ్‌లా కనిపిస్తారని ప్రశాంత్ నీల్ అన్నారు. అయితే ఆయన తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశానని, ఇప్పటికే తారక్‌కు అది వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. అయితే అది ఏ జోనర్ కథ అనేది తానిప్పుడే చెప్పలేనని ప్రశాంత్ నీల్ అన్నారు.ఎన్టీఆర్-31’ వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళుతుందని ప్రశాంత్ నీల్ చెప్పాడు. ‘సలార్’ పూర్తయిన అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలిపాడు.