ఆక్సీజ‌న్ మాస్క్ లేకుండానే.. సముద్రం లోప‌ల అడ్వెంచ‌ర్ చేసిన‌ అందాల ముద్దుగుమ్మ‌

ప్ర‌ణీత సుభాష్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. చేసింది త‌క్కువ సినిమాలే అయిన మంచి పాత్ర‌లు పోషించి అభిమానుల మ‌న‌సులు దోచుకుంది. కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన ప్ర‌ణీత 2011లో ఉదయన్ సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. పోర్కి హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన బావ (2010) సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది. జరాసంధ (2011), భీమ తీరడల్లి (2012), విజిల్ (2013), బ్రహ్మ (2014) సినిమాలతో కన్నడ పరిశ్రమలో పెద్ద కథానాయికగా ఎదిగింది. తెలుగులో అత్తారింటికి దారేది సినిమా ద్వారా ఇక్కడ కూడా మంచి స్టార్ స్టేట‌స్ సంపాదించింది.

క‌రోనా సంక్షోభంలో త‌న‌కి ఉన్నంత దానిలో సాయం చేస్తూ అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది ప్ర‌ణీత‌. క‌రోనా బాధితుల కోసం తెలుగు సినిమా పరిశ్రమ నుండి హీరోయిన్స్ లో మొదటగా విరాళం ఇచ్చిన ప్ర‌ణీత ఆకలితో అలమటించే వారి కోసం స్వయంగా వంట చేసి వారి ఆకలి తీర్చింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు తాజ‌గా త‌న సోష‌ల్ మీడియాలో స్ట‌న్నింగ్ వీడియో షేర్ చేసింది. ఇందులో సముద్రంలోకి దూకిన ప్ర‌ణీత ఆక్సీజ‌న్ మాస్ట్ లేకుండానే స్కూబా డైవ్ చేస్తూ అంద‌రు నోరెళ్ల పెట్టేలా చేసింది. ప్ర‌ణీత ధైర్యాన్ని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు

కాజ‌ల్ దంప‌తులు కూడా రీసెంట్‌గా స్కూబా డైవ్ వీడియోలు షేర్ చేయ‌గా, ఇవి కూడా నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. వీరు ఆక్సీజ‌న్ మాస్క్‌లు పెట్టుకొని డైవ్ చేశారు. హీరోయిన్ల సాహ‌సాలు అభిమానుల‌ని ఎంత‌గానో అబ్బుర‌ప‌రుస్తున్నాయి. కాగా, ప్ర‌ణీత ప్ర‌స్తుతం మాల్దీవుల‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్క‌డ ప్ర‌కృతిని ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది.