పూజా హెగ్డే ఐరన్ లెగ్ ఎఫెక్ట్.. జనగణమన వాయిదా పడిందా?

పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతూ ఉన్నారు.ఇలా వరుస ప్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఈమెకు మరోవైపు వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి.అయితే తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది.

ఇలా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగానే సినిమా ఆగిపోవడంతో పూజా హెగ్డే పై ఐరన్ లెగ్ అనే ముద్రవేశారు.కెరియర్ మొదట్లో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమెతో సినిమాలు చేయడానికి మేకర్స్ భయపడేవారు. ఇక ఇండస్ట్రీలో ఈమె కెరియర్ అయిపోయిందనుకునే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమెలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తించి తనకు అరవింద సమేత సినిమాలో అవకాశం కల్పించారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కావడంతో ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ఇలా అరవింద సమేత చిత్రం తర్వాత అలా వైకుంఠపురం, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలతో హిట్ కొట్టిన ఈమె తనపై పడిన ఐరన్ లెగ్ అనే ముద్ర చెరిపేసుకుంది. ఇకపోతే ఈమె నటించిన రాదే శ్యామ్, బీస్ట్, ఆచార్య మూడు బారీ బడ్జెట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమెను తిరిగి ఐరన్ లెగ్ అంటూ తనపై ముద్ర వేస్తున్నారు.

ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి జనగణమన సినిమాలు ఈమెను తీసుకోవడంతోనే ఈమె ఐరన్ లెగ్ ఎఫెక్ట్ సినిమా పై పడటం వల్ల ఏకంగా సినిమానే అట్టకేక్కిందని వార్తలు వినపడుతున్నాయి. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో, జనగణమన మేకర్స్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తద్వారా సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా పూజా హెగ్డే కారణంగానే ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు.ఇక ఈమె ఈ సినిమా మాత్రమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా తాను ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచి చూడాలి.