షూటింగ్ లో గాయపడిన పూజా హెగ్డే… ఆ ఫోటోని షేర్ చేస్తూ అసలు విషయం చెప్పిన నటి?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. ఈమె ఈ ఏడాది రాధేశ్యామ్, బీస్ట్,ఆచార్య వంటి వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొన్నప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమాలో నటించడమే కాకుండా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా షూటింగ్లో పాల్గొన్నటువంటి పూజా హెగ్డే తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పూజా హెగ్డే షూటింగ్ సమయంలో తన కాలికి గాయం అయినట్టు ఫోటోని షేర్ చేస్తూ లిగ్మెంట్ టియర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇలా పూజా హెగ్డే కాలికి దెబ్బ తగలడంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పూజా హెగ్డేకి ఈ ప్రమాదం సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేక మహేష్ బాబు సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా అనే విషయం గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈమె మాత్రం కాలికి దెబ్బ తగలడంతో కొద్దిరోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇక పూజ హెగ్డే ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న జనగణమన సినిమా షూటింగ్లో కూడా నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆపివేసిన విషయం మనకు తెలిసిందే.