బుర్రకు పదును పెట్టిన పూజా హెగ్డే.. పజిల్ పూర్తి చేసే పనిలో నిమగ్నమైన నటి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం ఇతర భాష సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి పూజా హెగ్డే ఒకరు.ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె పలు సినిమాలలో నటించిన గుర్తింపు రాలేదు అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమా ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె అనంతరం తెలుగు తమిళ హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా పలు భాష చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.అయితే గత కొద్ది రోజుల క్రితం ఈమెకు కాలు ఫ్యాక్చర్ కావడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు అయితే ఇంట్లో బోర్ కొట్టడంతో చేసేదేమీ లేక తన బుర్రకు పదును పెట్టి పజిల్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా ఇంటికి పరిమితమైన ఈమె పజిల్ ను ముందేసకుని.. వాటిసి సెట్ చేసే పనిలో బిజీగా ఉంది.

అప్పటికే ఓ 40 పర్సంట్ పజిల్ పూర్తి చేసిన ఇంకా దానిని పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఇక కాలికి గాయం కావడంతో సినిమా షూటింగుకు విరామం చెప్పినటువంటి ఈమె ఇంట్లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నారు.