ఆహా ఏమీ సుఖం.. మసాజ్‌తో గాల్లో తేలిపోతోన్న పూజా హెగ్డే

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఇటలీలో ఎంజాయ్ చేస్తోంది. రాధేశ్యామ్ కోసం ఇటలీ వెళ్లిన పూజా అక్కడ మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. ఈ మధ్యే అక్కడ బర్త్ డేను కూడా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. హోటల్ రూంలో తన స్టాఫ్‌తో కలిసి రచ్చ రచ్చ చేసింది. తన స్టైలీష్ట్, మేకప్ మెన్ ఇలా అందరూ కలిసి నానా హంగామా చేశారు. ఓ పెద్ద కేక్‌ను తీసుకొచ్చారు.. రూం అంతా గ్రాండ్‌ డెకరేట్ చేశారు. మొత్తానికి పూజా బర్త్ డేను మాత్రం ఓ రేంజ్‌లో సెలెబ్రేట్ చేశారు.

తాజాగా పూజా హెగ్డే షూటింగ్ గ్యాప్‌లో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ ఉడతను పట్టే ప్రయత్నం చేసింది. అయితే ఆ ఉడుత దగ్గరికి వెళ్లేందుకు, పట్టుకునేందుకు చాలా ప్రయత్నించిందట. మొదట చాలానే భయపడిందట. ఓ నాలుగైదు సార్లు ప్రయత్నించాక భయం పోయిందట. చివరకు ఆ ఉడుత తన దగ్గరున్న దాన్ని నోట్టో పెట్టేసింది. అలా తన కోరికను తీర్చేసుకుంది.

రీసెంట్‌గా పూజా హెగ్డే గాల్లో తేలిపోతోన్నట్టు కనిపిస్తోంది. పూజా హెగ్డే తన హెయిర్ స్టైలీష్ట్ భూమి శెట్టి ఓళ్లో పడుకుని ఉంది. ఎంచక్కా ఆమె మసాజ్ చేస్తుంటో హాయిగా స్వర్గంలో తేలిపోయినట్టు కళ్లు మూసుకుని పడుకుంది. హెడ్, ఫేస్ మసాజ్ చేస్తుంటే పూజా చక్కగా ఓ కునుకుతీసినట్టు కనిపిస్తోంది. పూజా హెగ్డే ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ టీజర్, రాధేశ్యామ్ మోషన్ పోస్టర్లతో సందడి చేసేందుకు రెడీగా ఉంది.