వాళ్లకు అవే కావాలి.. దక్షిణాదిపై పూజా హెగ్డే సంచలన కామెంట్స్

Pooja Hegde ABout South Audience

ఉత్తరాదికి చెందిన భామలు దక్షిణాదిలో పేరు సంపాదించాకుంటారు. సినీ రంగంలో దక్షిణాదిన పేరు తెచ్చుకుంటారు. మళ్లీ ఉత్తరాది జపం చేస్తుంటారు. దక్షిణాదిలోనే సంపాదన, అభిమానం అన్నీ ఉంటాయి. కానీ వాళ్లకు మాత్రం దక్షిణాది ప్రేక్షకులంటే చులకన ఉంటుంది. అలాంటి వారి జాబితాలోకి పూజా హెగ్డే ఎక్కింది. పూజా హెగ్డే తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్నాయి.

Pooja Hegde ABout South Audience
Pooja Hegde ABout South Audience

ఆ మధ్య సమంతపై నెగెటివ్ కామెంట్ చేసి.. అకౌంట్ హ్యాక్ అయిందని నాటకమాడింది పూజా హెగ్డే. ఆ సమయంలో పూజాను ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. పాత ఫోటోలను తీసి ట్రోల్స్, మీమ్స్‌తో పూజా హెగ్డే పరువు తీసేశారు. తాజాగా మరోసారి అలాంటి ఓ పరిస్థితే పూజా హెగ్డేకు ఎదురైంది. అదేంటో ఓ సారి చూద్దాం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. సౌత్ ఇండియ‌న్ సినిమా వాళ్లు న‌డుము మ‌త్తులోనే ఉంటార‌ని, మిడ్ డ్రెస్‌ల‌లో త‌మ‌ను చూడాల‌నుకుంటార‌ని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడే ఫేమస్ అయి, ఇక్కడే క్రేజ్, డబ్బులు సంపాదించుకుని ఇక్కడిప్రేక్షకులనే చిన్న చూపు చూస్తావా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటివి చేస్తే పూజా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో బిజీగా ఉంది.

Pooja Hegde, Radhe shyam, పూజా హెగ్డే, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్