మరోసారి స్క్రీన్ మీద నాగార్జున, అనుష్క.. ఎంత కష్టపడి ఒప్పించారో ..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 4 ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం నాలుగో సీజన్ టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే మూడు వారాలు ఈ సీజన్ 4 కంప్లీట్ చేసుకుంది. సీజన్ 4 కి బాగా ప్లస్ అయింది అంటే కింగ్ నాగార్జున డ్యూయల్ రోల్ లో ప్రేక్షకులని అలరించడం. కాని అది పూర్తి స్థాయిలో లేకపోవడం ప్రేక్షకులని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇప్పటి వరకు గడిచిన మూడు సీజన్లకు మంచి హైప్ అండ్ రేటింగ్ లు వచ్చాయి. కానీ ఈ నాలుగో సీజన్ కు మాత్రం మొదటి ఎపిసోడ్ నుంచే పాపులర్ కంటెస్టెంట్స్ లేక షో జనాలని తీవ్రంగా నిరాశపరుస్తుందని టాక్ వినిపిస్తుంది.

BiggBoss4: All Contestants Tested -Ve, Shoot from Aug 22nd | Gulte - Latest  Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews,  Analysis, Photos

దాంతో స్టార్ మా కొత్త ప్లాన్ వేసింది. ఎలాగైనా రేటింగ్ డ్రాపవకుండా ఉండాలని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఒక్కొక్కరిని హౌజ్ లోకి పంపి ఎంటర్‌టైన్‌మెంట్ క్రియోట్ చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తాజాగా చిన్న సినిమాలు చేస్తున్న హీరోయిన్ స్వాతి దీక్షిత్ హౌజ్ లోకి తీసుకు వచ్చారు. ఈ హాట్ బ్యూటీ తో షో కి కాస్త కలిసొస్తుందని భావిస్తున్నారట.

Anushka's Nishabdham to have an October release

కాగా తాజా సమాచారం ప్రకారం నాగార్జున, అనుష్క కలిసి ఈ వారం బిగ్ బాస్ 4 లో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ మీద నాగార్జున – అనుష్క జంట ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క నాగార్జున తో కలిసి కంటెస్టెంట్స్ ని సర్‌ప్రైజ్ చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.