ఎన్టీఆర్ భావమరిదికి సపోర్ట్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్

జూనియర్ ఎన్టీఆర్ భావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా రిలీజ్ కి నోచుకోలేదు. గత ఏడాది ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ మూవీపై ఎలాంటి బజ్ కూడా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రంగంలోకి దిగింది.

ఈ మూవీని రిలీజ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఈ సినిమా త్రీఇడియట్స్ టైపులో ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. శతమానం భవతి సినిమాతో టాలీవుడ్ మంచి టాలెంటెడ్ దర్శకుడిగా సతీష్ వేగేశ్న గుర్తింపు తెచ్చుకున్నాడు. రచయితగా సక్సెస్ అయిన సతీష్ వేగేశ్న దర్శకుడిగా మారి శతమానం భవతి సినిమాతో సక్సెస్ కొట్టారు.

తరువాత సీతారాముల కళ్యాణం అనే సినిమా నితిన్ తో చేశారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. తరువాత కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఎన్టీఆర్ భార్య ప్రణతి తమ్ముడు అయిన నార్నే నితిన్ ని హీరోగా పరిచయం చేసే బాద్యతని సతీష్ వేగేశ్న తీసుకున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. దీనికి శ్రీశ్రీశ్రీ రాజావారు అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. అయితే ఆర్ధిక కారణాల కారణంగా రిలీజ్ కి నోచుకోలేదు. ఈ నేపధ్యంలో సితార నిర్మాత అయిన నాగవంశీ ముందుకొచ్చి సినిమాని చూసి రిలీజ్ చేయడానికి ఆర్ధికంగా సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే సితార ఈ సినిమాని సపోర్ట్ చేయడం వెనుక ఎన్టీఆర్ ప్రమేయం ఉందనే మాట ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.